Monday, April 29, 2024

కరోనా బారిన పడ్డ డీజీపీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల కార్యక్రమాలను ఆదివారం రాత్రి వరకు స్వయంగా పర్యవేక్షించిన డీజీపీ అస్వస్థతకు గురికావడంతో అనుమానం వచ్చి వైద్య పరీక్షలు జరిపించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయన సోమవారం గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఉన్నారు. శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్‌ మహేందర్‌రెడ్డి తరుపున వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో కూడా ఇతర పోలీసు ఉన్నతాధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement