Sunday, April 28, 2024

Devotional – వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబల కళ్యాణం

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)9: విశ్వ మానవ కళ్యాణం కోసం, సనాత నధర్మ పరిరక్షణ కోసం జగద్గురు దంపతుల కళ్యాణం ప్రతినెల ఒకరి ఇంటా నిర్వహి స్తామని విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రాఘవపురం గోపాలకృష్ణచార్య తెలిపారు. ఇంటింటా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కళ్యా ణం కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఆర్యనగర్ లో ఆదివారం విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా సలహాదారులు బ్రహ్మశ్రీ వడ్ల హన్మాండ్లు చారి సరోజన దంపతుల ఇంట్లో నూనె లింగాచార్యుల పౌరోహిత్యంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవింద మాంబల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.

భక్తులే పెళ్లి పెద్దలుగా జరిగిన ఈ కళ్యాణ కార్యక్రమంలో వేవా కార్యవర్గ సభ్యులు శ్రీధర్,రాంచందర్, శ్రీనివాస్, కాళిదాసు,విజయ్ కుమా ర్,వెంకటేశం, ప్రదీప్ తదిత రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement