Sunday, April 28, 2024

TS: ఆరేపల్లిని గెలిపిస్తేనే అభివృద్ధి… బండి సంజయ్

ఆరెపల్లి మోహన్ పక్కా లోకల్ అని.. ఆయనను గెలిపిస్తే మానకొండూరు సమగ్రాభివృద్ధి చెందుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మానకొండూరు బీజేపీ అభ్యర్ధి ఆరెపల్లి మోహన్ నామినేషన్ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. అరేపల్లి మోహన్ పక్కా లోకల్ అని, ఆయనకు మానకొండూరు నియోజకవర్గంలోని గల్లీగల్లీ పట్ల అవగాహన ఉందన్నారు. సమస్యలన్నీ తెలుసన్నారు. ఆయనను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కమీషన్ల యావతో మిమ్మల్ని పట్టించుకోవడం మానేసిండన్నారు. తగిన గుణపాఠం చెప్పండంటూ బండి సంజయ్ కుమార్ మానకొండూరు ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈరోజు మధ్యాహ్నం బీజేపీ మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి ఆరెపల్లి మోహన్ దాఖలు చేసిన నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మానకొండూరు చెరువు నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం భారీ ఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement