Saturday, April 27, 2024

Tiruvuru – మాన‌సిక రోగిపై అత్యాచారం … ఆరుగురు అరెస్ట్ ..

విజయవాడ : మతిస్థిమితం సరిగ్గా లేని దళిత యువతిపై కొందరు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసారు. కొన్ని నెలలుగా యువతిపై అఘాయిత్యానికి పాల్పడగా ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. తిరువూరు నియోజకవర్గంలోని ముష్టికుంట గ్రామానికి చెందిన ఓ యువతి మానసిక రోగి. ఆమె తల్లి చనిపోయింది… తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డాడు. దీంతో ఆమె బాగోగులు చూసేవారు లేకుండాపోయారు. ఇలా ఆమె దీన పరిస్థితి చూసి అందరూ బాధపడితే కొందరు మాత్రం ఆడతనాన్నే చూసారు. అదే గ్రామానికి చెందిన ఆరుగురు ఆమెపై కన్నేసి ఒకరికి తెలియకుండా ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా కొన్ని నెలలుగా ఆమెపై ఈ మృగాలు అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నారు.


ఇటీవల యువతి గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. కానీ ఈ విషయాన్ని గుట్టుగా వుంచేందుకు కొందరు పెద్దమనుషులు ప్రయత్నించారు. యువతి మానానికి విలువకట్టి ఆమెపై అఘాయిత్యాన్ని పాల్పడిన దుర్మార్గులను కాపాడే ప్రయత్నం చేసారు. యువతికి గుట్టుగా అబార్షన్ కూడా చేయించారు. అయితే పెద్దల పంచాయితీతో న్యాయం జరగలేదని భావించిన బాధిత యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో తిరువూరు పోలీసులు ఆత్యాచారానికి పాల్పడిన ఆరుగురిని అరెస్ట్ చేసారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement