Saturday, May 4, 2024

నాగోబాను ద‌ర్శించుకున్న హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ ద‌త్తాత్రేయ‌..

ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్ మండలంలో నాగోబా జాతర వైభవంగా కొనసాగుతున్నది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. సోమవారం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు పలువురు ప్రముఖులు నాగోబా ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సోయం బాపురావు దత్తాత్రేయకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో దత్తన్న నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ప్రజలాంతా క్షేమంగా ఉండాలని నాగోబాకు మొక్కుకున్నట్లు తెలిపారు. గిరిజనుల సాధికారత కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని సూచించారు. ఏజెన్సీలో 1/70 చట్టం పటిష్ఠంగా అమలు చేయాలని, విద్య, వైద్యం, మౌలిక వసతులు మెరుగుపర్చాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement