Friday, April 26, 2024

ముంబై : మహాలో మళ్లీ కరోనా వ్యాప్తి విజృంభణ

మహారాష్ట్రలో ఇప్పుడిప్పుడే నెమ్మదించిన కరోనా మళ్లీ విజృంభిస్తోంది. వాస్తవానికి కరోనా వ్యాప్తి తీవ్రతతో మహారాష్ట్ర వణికిపోయింది. రోజూ వేలాది కొత్త కేసులతో వూహాన్ ను తలపించింది. అయితే తరువాత తరువాత వ్యాప్తి తీవ్రత తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జనజీవనం మెల్లిమెల్లిగా యథాపూర్వ స్థితికి చేరుకుంటున్నది. అంతా హమ్మయ్య అనుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో మళ్లీ మహమ్మారి పంజా విసిరింది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 4,092 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 40 మందిని కరోనా మహమ్మారి బలితీసుకుంది.  దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20 లక్షల 64వేల 278కి చేరుకుంది. అలాగే కరోనా మరణాల సంఖ్య 51, 529కి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement