Wednesday, May 1, 2024

ధర్మపురి శ్రీనివాస్ కు అస్వస్థత

నిజాంబాద్ జిల్లా రాజకీయ అపార అనుభవశాలి, పిసిసి మాజీ అధ్యక్షులు, బి ఆర్ ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ అస్వస్థత గురయ్యారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇటీవల అస్వస్థత గురైన డిఎస్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ఈ మేరకు సోమవారం మధ్యా హ్నం డిఎస్ మరో మారు అస్వస్థతకు గురయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ చక్రం తిప్పిన రాజకీయ దిగ్గజం డిఎస్ రెండుసార్లు పిసిసి అధ్యక్షులుగా ఉండే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే కాకుండా పలు శాఖల మంత్రి హోదాలను నిర్వహించి, రాజకీయాల్లో నిజాంబాద్ జిల్లాను శాసించిన అపర మేధావి. నేటికీ డిఎస్ నేపథ్యంలోనే వారి తనయులు రాజకీయంగా తమ శాఖ చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

భవిష్యత్తులోనూ వారి తనయులు జిల్లాలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డి ఎస్ ఆరోగ్యం కుదుటపడాలని ఆయన ఇంకా పది కాలాలపాటు బతికొండి ప్రజలకు సేవలను అందించడంతోపాటు తమ అనుచరులకు పెద్దది ఎక్కువగా ఉన్నారని పలువురు అభిమానులు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement