Sunday, April 28, 2024

సైబరాబాద్ సీపీ కీలక ఉత్తర్వులు.. ఇద్దరిపై వేటు

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలక ఆదేశాలు జారీ చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గంగాధర్, ఎస్‌ఐ లక్ష్మణ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరిపై తీవ్రమైన భు వివాదాలు, అవినీతి ఆరోపణలు రావడంతో ఈ మేరకు సస్పెండ్ చేశారు.

నార్సింగ్ పీఎస్ పరిధిలోని పలు భూ వివాదంలో ఇన్స్పెక్టర్ గంగాధర్ తల దూర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుడి ఫిర్యాదుతో సైబరాబాద్ సీపీ విచారణ జరిపిన అనంతరం.. ఇన్ స్పెక్టర్ గంగాధర్‌, ఎస్ఐ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేశారు.

ఇది కూడా చదవండి: TS: ఆర్టీసీ బస్సుల్లో క్యాష్‌ లెస్‌ జర్నీ.. డిజిటల్‌ పేమెంట్స్‌ దిశగా యత్నాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement