Saturday, May 4, 2024

ఐటీ కంపెనీల టైమింగ్స్ మార్చుకోండి: సైబరాబాద్ పోలీసులు

హైద‌రాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ జాం పెరిగిపోతుండటంతో హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలు ఇవాళ, రేపు ఆఫీసు వేళలు మార్చుకోవాలని సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఐకియా నుంచి సైబర్ టవర్ రోడ్ వరకు ఉన్న కంపెనీలు మధ్యాహ్నం 3. గంటలకు, ఐకియా, బయో డైవర్సిటీ, రాయదుర్గంలో పరిధిలోని కంపెనీలు 4.30 గంటలకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలిలోని కంపెనీలు సాయంత్రం 6 గంటలకు లాగౌట్ చేసుకోవాలని సూచించింది. ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు రెండు రోజుల పాటు ఈ సూచ‌న‌లు పాటించాల‌ని కోరింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement