Thursday, May 2, 2024

ADB: ఇంటి వద్దకు వచ్చిన మొసళ్లు.. భయాందోళనలో ప్రజలు

జన్నారం, ఆగస్టు 1 (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపెళ్లిలోని ఓ ఇంటి వద్దకు మంగళవారం మొసలి వచ్చింది. దీంతో ఆ గ్రామస్తులు భయాందోళన చెంది, స్థానిక రేంజ్ ఆఫీసర్ హాఫీజో దీన్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన బీట్ ఆఫీసర్ ను అక్కడికి పంపారు.

ఆ జన్నారం గొండుగూడ అటవీ బీట్ ఆఫీసర్ ఏ.సతీష్ అక్కడికి చేరుకొని ఆ మొసలిని గోనె సంచిలో బంధించి సమీపాన ఉన్న గోదావరి నదిలో వదిలిపెట్టారు. మరో రెండు మొసలి చిన్న పిల్లలు వచ్చినట్లు ఆయన చెప్పారు. వాటిని పట్టుకుని సమీపాన ఉన్న గోదావరి నదిలో విడిచిపెట్టామన్నారు. గ్రామస్తులు ఆందోళన చెందవల్చిన అవసరం లేదని రేంజ్ ఆఫీసర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement