Tuesday, May 14, 2024

TS | నిధులు తీసుకువచ్చే దమ్ములేకనే బీజేపీ నేతల విమర్శలు: మేడే రాజీవ్ సాగ‌ర్‌

బీఆర్ఎస్ పార్టీని తిట్టడంలో పోటీపడుతున్న బీజేపీ నేతలు.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎందుకు పోటీపడడం లేదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ప్రశ్నించారు. అసలు రైతులకు బీజేపీ పార్టీ ఏం చేసిందని ఖమ్మంలో రైతు సభ పెట్టారని దుయ్యబట్టారు. ఖమ్మం సభకు వచ్చిన అమిత్ షా వారు రైతులకుచేసిన మేలు ఏమి లేకపోవడంతో కేసీఆర్ పై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు.

తెలంగాణలో ఎక్కడ లేని విధంగా రైతుబీమా పథకం అమలవుతుందని అన్నారు. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీనినే ఆదర్శంగా తీసుకుని కేంద్రంలో కిసాన్ సమ్మాన్ యోజన పథకం తీసుకువచ్చింది నిజం కాదా అన్నారు. రైతు వ్యతిరేక బిల్లులు తీసుకురావాలని చూసిన నీచమైన చరిత్ర బిజేపీ పార్టీదని మండిప‌డ్డారు. వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి ధర్నాలు చేసిన విషయం యావత్ దేశ ప్రజలు మరిచిపోలేదని ఆయ‌న గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement