Sunday, April 28, 2024

Crime News -నిద్రిస్తున్న యాచకులపై కత్తులతో దాడి – ఒకరి మృతి

సికింద్రాబాద్‌ పరిధిలో ఆదివారం రాత్రి దుండగులు యాచకులపై కత్తులతో పొడిచారు. దాడిలో ఒకరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది..మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద దాడి జరిగింది. ఫుట్ పాత్‌పై పడుకున్న యాచకుడిపై ముగ్గురు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. మెడను నరికి, తలపై భాగంలో కత్తులతో దాడి చేశారు. దాంతో ఆ యాచకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గణేశ్ ఆలయ సమీపంలో మరో దాడి జరిగింది. ఫుట్ పాత్‌పై పడుకున్న మరో యాచకుడిపై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. అతనిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అరగంట వ్యవధిలో రెండుచోట్ల దాడులు జరిగాయి. అక్కడున్న వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చారు.దాడి చేసిన నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement