Friday, May 17, 2024

Crime: డీజే పెట్ట‌లేద‌ని లొల్లి లొల్లి.. ఇరువ‌ర్గాల ఘ‌ర్ష‌ణ‌లో ఇద్దరు మృతి.. ఎక్క‌డో తెలుసా!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం ఇచ్చోడ మండలం గుండాలలో ఉర్సు సందర్భంగా ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. డీజే పెట్ట‌లేద‌ని ఇరువర్గాల మధ్య జ‌రిగిన లొల్లి ముదిరి కొట్లాట‌కు దారితీసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చ‌నిపోయారు. మ‌రో 10మందికి తీవ్ర గాయాల‌య్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

రెండేళ్లుగా గ్రామంలో ఇరువర్గాల మధ్య కక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉర్సు జరుపుకొనేందుకే గ్రామం సన్నధ మౌతుండగా డీజే రూపంలో మారణహోమం జ‌రిగింది. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన జాహీరోద్దిన్ (70), ముక్రం (60) అక్కడికక్కడే మరణించారు. సిరాజ్ , వసీం తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెల‌కొంది. భయానక వాతావరణం నెలకొన్నది. పోలీస్ ఉన్నతాధికారులు గ్రామాన్ని చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement