Friday, May 17, 2024

ఘోర రోడ్డుప్ర‌మాదం : నలుగురి దుర్మరణం

ఘోర రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు దుర్మ‌ర‌ణం పాలైన విషాద ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ మండలం డిడ్గి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. బాలరాజు (28), శ్రావణి (22) అనే దంపతులు, వారి ఎనిమిది నెలల చిన్నారి అమ్ములుతో కలిసి బైకుపై వెళ్తుండ‌గా ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఆపై కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న దంపతులు, చిన్నారితో సహా, కారులోని మొహమ్మద్ ఫరీద్(25) కూడా మరణించాడు. కాగా, మృతిచెందిన వారు అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందినవారిగా గుర్తించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement