Thursday, May 9, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు – స‌భ‌లు, స‌మావేశాల‌పై ఆంక్ష‌లు

హైదరాబాద్‌: తెలంగాణ శాసన మండలికి మార్చి 14వ తేదీన పట్టభద్రుల స్థానం పోలింగ్‌ నేపధ్యంలో జంటనగరాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులపై ఆంక్షలు విధిస్తున్నట్టు నగర పోలీస్‌కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి అమల్లోకి వచ్చేఈ ఉత్తర్వులు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. ప్రత్యేకించి గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికలుకావడంతో జంటనగరాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకోవడానికి తప్పని సరిగా జిల్లా ఎన్నికల అధికారి, లేదా రిటర్నింగ్‌అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని అన్నారు. అలాగే పోలీసులకు సహకరించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement