Wednesday, May 1, 2024

మధిర తహసీల్దార్ కార్యాలయంలో ఏడుగురికి కరోనా

మధిర : ఖమ్మం జిల్లా మధిర తహశీల్దార్. కార్యాలయం పనిచేసే ఏడుగురు సిబ్బందికి సోమవారం కరోనా సోకింది. ఈ విషయాన్ని తెలుసుకున్న దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శశిధర్ తహసిల్దార్ కార్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేష్ మాట్లాడుతూ…. తహసీల్దార్ కార్యాలయానికి అత్యవసరం పని ఉంటే మాత్రమే రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. సిబ్బందిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement