ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై వ్యవహారంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. టికెట్ల వివాదంపై వర్మ, పేర్నినానిల మధ్య ట్విట్ట్ వార్ కొనసాగింది. వర్మ అడిగిన ప్రశ్నలకు ఏపీ మంత్రి పేర్ని నాని కూడా సమాధానం ఇచ్చారు. టికెట్ల ధరల తగ్గింపుపై నేరుగా చర్చించడానికి సిద్ధమని ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఏపీ ప్రభుత్వం నుంచి ఆయనకు ఆహ్వానం అందింది.
సినిమా టికెట్ల ధరల వివాదంపై తమతో సమావేశానికి రావాలంటూ పేర్ని నాని నుంచి వర్మను ఆహ్వానించారు. దీంతో ఈ రోజు హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చారు. సినిమా టికెట్ల రేట్లపై మంత్రి పేర్నినానితో వర్మ చర్చలు జరపనున్నారు. దీంతో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital