Thursday, May 9, 2024

పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ జిహెచ్ఎంసి ముట్ట‌డి.. ఉద్రిక్త‌త

హైదరాబాద్: పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బల్దియా కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. దీంతో హెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు రూ వెయ్యి కోట్లు బిల్లులు చెల్లించాల‌ని కాంట్రాక్ట‌ర్లు అంటున్నారు.. ఎన్నిసార్లు అడిగినా బిల్లుల‌కు మోక్షం క‌లుగ‌క‌పోవ‌డంతో బల్దియా ముట్టడికి కాంట్రాక్టర్లు, వారి కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. దీంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి వారిలో కొంద‌ర్ని అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి త‌ర‌లించారు.. ఈ సంద‌ర్బంగా కాట్రాంక్ట‌ర్ల‌కు పోలీసుల మ‌ధ్య వాగ్వ‌దం జ‌రిగింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement