Friday, May 17, 2024

ADB: శ్రీరాంపూర్ ఓసీలో కాంట్రాక్ట్ కార్మికుడి ఆత్మహత్య

శ్రీరాంపూర్, సెప్టెంబర్ 30 (ప్రభ న్యూస్) : శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్ లో ఓబి కాంట్రాక్టు నిర్వహిస్తున్న కంపెనీలో పనిచేస్తున్న వీరస్వామి గౌడ్ (50) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి కాంట్రాక్టు ఉద్యోగుల కథనం ప్రకారం… మృతిచెందిన వీరస్వామి గౌడ్ సూర్యాపేటకు జిల్లాకు చెందిన వ్యక్తి.

గత 20 సంవత్సరాలుగా సీఆర్ఆర్ కాంట్రాక్టు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారని, రెండు రోజులుగా కంపెనీ వారు విధుల్లోకి తీసుకోకపోవడంతో మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement