Monday, May 6, 2024

Electric Shock: క‌రెంట్‌షాక్‌తో కానిస్టేబుల్ మృతి…విచారం వ్య‌క్తం చేసిన సీఎం

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో విషాధం నెల‌కొంది. కూబింగ్ చేస్తున్న స‌మ‌యంలో క‌రెంట్ షాక్ త‌గిలి కానిస్టేబుల్ ప్ర‌వీణ్​ మృతి చెందాడు. కానిస్టేబుల్ మృతి పై సీఎం రేవంత్‌రెడ్డి విచారం వ్య‌క్తం చేశారు.

జంతువుల‌ను వేటాడేందుకు దుండగులు ఇనుప‌కంచెల‌ను ఏర్పాటు చేశారు. ఇనుపకంచకు కరెంట్ పెట్టారు దుండగులు. ఇది గ‌మ‌నించ‌ని కానిస్టేబుల్ కూబింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఆ తీగుల‌ను ముట్టుకున్నాడు. ఈ తరుణంలోనే..కరెంట్ షాక్ తో కానిస్టేబుల్ ప్రవీణ్‌ మృతి చెందాడు.  ఈ ఘ‌ట‌న పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. కానిస్టేబుల్ మృతికి కార‌ణ‌మైన దుండుగ‌ల‌ను ప‌ట్టుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement