Wednesday, May 15, 2024

Rozgar Mela: ఉపాధి మేళాలో ల‌క్ష మందికి ప్రధాని నియామక పత్రాల పంపిణీ..

ప్రధాని మోదీ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కర్మయోగి భవన్ మొదటి దశకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన లక్ష మందికి పైగా అభ్యర్థులకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయ‌నున్నారు.

దేశవ్యాప్తంగా 47 చోట్ల ఈ ఉపాధి మేళా నిర్వహించనుంది. రెవెన్యూ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ, అణు ఇంధన శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కుటుంబ సంక్షేమం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో కొత్త నియామకాలు జరిగాయి.

- Advertisement -

అయితే, దేశంలో ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాని మోడీ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ఈ జాబ్ మేళా ముందడుగు వేసింది. ఈ రోగ్ గర్ మేళా ఉపాధి కల్పనను పెంచడంతో పాటు యువతకు వారి సాధికారత, దేశాభివృద్ధిలో భాగస్వామ్యానికి లాభదాయకమైన అవకాశాలను అందించాలని భావిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. కొత్తగా నియమితులైన ఉద్యోగులు కూడా ఐజీవోటీ కర్మయోగి పోర్టల్‌లో ఆన్‌లైన్ మాడ్యూల్ శిక్షణ పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement