Sunday, April 28, 2024

Paragliding: పారాగ్లైడింగ్ స‌ర‌దా…. హైద‌రాబాద్ టూరిస్టు మృతి…

పారాగ్లైడింగ్ స‌ర‌దా ఓ టూరిస్టు ప్రాణం తీసింది. హైదరాబాద్‌కు చెందిన టూరిస్టు పారాగ్లైడింగ్ చేస్తూ దుర్మరణం పాల‌య్యాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఘటనపై కులూ పర్యాటక శాఖ అధికారిణి సునైనా శర్మ స్పందిస్తూ మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగుండొచ్చని అన్నారు. పారాగ్లైడింగ్ చేసిన ప్రదేశం, ఇందుకు వాడిన పరికరాలు, పైలట్‌కు అనుమతి ఉందన్నారు. ఘటన జరిగిన సమయంలో వాతావరణ సమస్యలు ఏవీ లేవని కూడా తెలిపారు. ఘటన నేపథ్యంలో అక్కడ పారాగ్లైడింగ్‌ను సస్పెండ్ చేసినట్టు కూడా వెల్లడించారు. కాగా, ప్రమాదానికి బాధ్యుడైన పైలట్‌పై ఐపీసీ 336, 334 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement