Sunday, May 5, 2024

Congrss Party – ఖమ్మం నుంచి తుమ్మల… పాలేరు నుంచి పొంగులేటి పోటి..

న్యూఢిల్లీ – ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా బరిలోకి దిగనున్నారు.. నేడు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.. కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం మేర‌కు ఢిల్లీ వెళ్లిన తుమ్మ‌ల స‌మ‌క్షంలో సీట్ల విష‌యంపై రాహుల్ చ‌ర్చించారు.. అనంతరం తుమ్మ‌ల‌ను ఖ‌మ్మం నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్ కోరిన‌ట్లు ఎఐసిసి సమాచారం .. ఇక మ‌రో నేత పొంగులేటి తాను గ‌తం నుంచి ఆశీస్తున్న పాలేరు నుంచే పోటీ ప‌డ‌నున్నారు.. ఈ ఇద్ద‌రి అభ్య‌ర్ధిత్వాలు అధికారికంగా త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement