Thursday, May 2, 2024

HYD :ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్

ఎల్బీనగర్, నవంబర్ 16(ప్రభ న్యూస్)
హస్తం గుర్తుకు ఓటేద్దాం అవినీతి లేని ఎల్బీ నగర్ కు బాటేద్దాం అనే శీర్షికతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలువురు న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, వివిధ రంగాల నిపుణులు, ఉద్యోగులు కాంగ్రెస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు తెలిపారు. మధు యాష్కీ గౌడ్ పై జరిగిన అక్రమ సోదాల దాడిని ఖండిస్తున్నామని తెలిపారు.

మేమంతా మీకు న్యాయపరంగా తోడుగా ఉంటామని ప్రకటించారు, అధికారులు నియమిబంధనలు పాటించకుండా అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తే, సంబంధిత అధికారులపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ నియమాలు పాటించాలని కోరారు. అనంతరం మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ ఒక న్యాయవాదిని, ఈ గులాబీల్లకు, గుండాల్లకు భయపడే వ్యక్తిని కాదన్నారు. త‌న‌ను గుండెల్లో పెట్టుకున్న ఎల్బీనగర్ గడ్డ ప్రజల మద్దతు నా వైపు ఉందని, మీరెన్ని కుట్రలు చేసినా, ప్రచారానికి అడ్డుపడ్డ రేపు ఎమ్మెల్యేగా గెలవడం తథ్యమన్నారు. నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. మొట్టమొదటి ప్రాధాన్యత మురికి కాలువల నిర్వహణ, చెరువుల కబ్జాలతో వరదలుస్తున్నాయని, కళ్ళు మూసుకున్న చెరువుల నుండి కంపు వాసన కొడుతుందని కాని కళ్ళ ముందు అభివృద్ధి అంటున్నారు. ఈ కార్యక్రమంలో జక్కడి ప్రభాకర్ రెడ్డి మజీర్ ప్రకాష్ గౌడ్,మల్యాద్రి, అడ్వకేట్ కరణ్, వెంకటేష్ యాదవ్,సుధాకర్ గౌడ్, నిరంజన్, రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement