Wednesday, May 1, 2024

NLG : కాంగ్రెస్ మేనిఫెస్టును వివ‌రిస్తూ కాంగ్రెస్ నేత‌ల ప్ర‌చారం

పెన్ పహాడ్, న‌వంబ‌ర్ 26(ప్ర‌భ‌న్యూస్‌)తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారంమండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పై గడపగడప ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హాయంలోనే అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇచ్చిందని, ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించిందని, రైతులకు ఏ కాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీంలు అమలు కావాలంటే సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుందూరు వెంకటరెడ్డి, దొంతగాని గోపయ్య, బెల్లంకొండ శ్రీరాములు బండి శ్రీరామ్ రెడ్డి ,నాతాల వెంకట్రాంరెడ్డి, బొల్లి కొండ వీరస్వామి ,బచ్చలకూరి గోపి బండి శ్యాంసుందర్ రెడ్డి, షేక్ ఉస్మాన్, వెంకట్ రెడ్డి, నరసయ్య, వెంకన్న ,సైదులు ,మధు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement