Sunday, May 5, 2024

TS | కాంగ్రెస్‌కు షాక్ ఇయ్యాలే.. బీఆర్ ఎస్‌ను మ‌ళ్లీ గెలిపించాలి: భువ‌న‌గిరి స‌భ‌లో సీఎం కేసీఆర్‌

కరువుతో ఉన్న భువనగిరి లో ఇవ్వాళ అద్భుతమైన పంటలు పండిస్తున్నారు. ఈ జిల్లాకు యాదాద్రి భువనగిరి అని లక్ష్మీనరసింహస్వామి పెరు పెట్టుకున్నాం.. ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైన త‌ర్వాత అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అద్భుతమైన అభివృద్ధి చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. భువ‌న‌గిరిలో జ‌రిగిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో గులాబీ అధినేత ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​కు షాక్​ ఇవ్వాల్సిందేనని, మళ్లీ బీఆర్​ఎస్​ పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

మళ్లీ గెలిచేది శేఖర్ రెడ్డినే. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మిస్తున్న బస్వపూర్ రిజర్వాయర్ ద్వారా త్వరలోనే నీళ్లు అందిస్తాం. ధరణి ద్వారా రైతుల కష్టాలు పోయాయి. అన్నదాతలు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.. కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తాం అంటున్నారు.. ధరణి పోతే మళ్లీ అన్నదాతలు కొట్లాటలు వస్తాయి.. అవినీతి వస్తది. ఫైరవి కారుల కాంగ్రెస్ పార్టీని రానివ్వొద్దు.. కాంగ్రెస్ తో పెద్ద ప్రమాదం పొంచి ఉంది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..

కాంగ్రెస్ వస్తే కరంట్ మాయం అవుతుంది… అప్రమత్తంగా ఉండాలి… 3 గంటలు కరంట్ ఇస్తాం అంటున్న కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలి.. భువనగిరి లో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం… నాకున్న సర్వే ప్రకారం 50 వేల మెజార్టీతో భువనగిరి లో గెలుస్తున్నాం… పొన్నాల అనే నాయకుడు తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ ఎస్‌లోకి వచ్చారు… బీఆర్ ఎస్‌ని మళ్ళీ గెలిపించాలి… పార్టీకి కులం మతం అనే తార తమ్య భేదాలు లేవు… అందరి బాగు కోసం మ్యానిఫెస్టో విడుదల చేసాము.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. యాదాద్రి లో భూముల రేట్లు అమాంతం పెరిగాయి.. అందరికి సన్న బియ్యం అందిస్తాం… అన్నదాతలకు 24 గంటల కరంట్ వుండాలంటే బీఆర్ ఎస్ మాత్రమే గెలవాలి..

Advertisement

తాజా వార్తలు

Advertisement