Wednesday, May 1, 2024

Congress – మ‌ల్కాజ్ గిరి ఎంపి సీటు గెల‌వాల్సిందే – తుమ్మ‌ల

హైద‌రాబాద్ – ప్ర‌స్తుత సిఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హించిన మ‌ల్కాజ్ గిరి లోక్ స‌భ సీటును భారీ మెజార్టీతో తిరిగి కైవ‌సం చేసుకోవాల‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కాంగ్రెస్ శ్రేణుల‌కు పిలుపు ఇచ్చారు..మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా ఉన్న మంత్రి తుమ్మల టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌లల‌తో కాంగ్రెస్ నేతలతో మీటింగ్ నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, కంటెస్టడ్ కార్పొరేటర్లతో సమావేశమశానికి హాజ‌ర‌య్యారు..

ఈ సంద‌ర్భంగా రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ విజయమే లక్ష్యంగా ఎలా పనిచేయాలనే విషయాలపై చర్చించారు. అన్ని విధాలుగా తన పూర్తి సహకారం ఉంటుందని తుమ్మల హామీ ఇచ్చారు. స్థానికంగా ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలని, అందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గ‌తం కంటే మెజార్టీ మ‌రింత పెర‌గాల‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement