Sunday, April 28, 2024

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కాంగ్రెస్ నేత‌ల నిర‌స‌న : మంత్రి, క‌లెక్ట‌ర్ కు విన‌తి

ప‌లు స‌మస్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ కాంగ్రెస్ నేత‌లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర‌స‌న తెలిపారు. జిల్లాలోని పలు సమస్యలు, కుల్కచెర్ల మండలంలోని పుట్టపహాడ్ గ్రామంలోని రైతు చంద్రమ్మ బతికుండగానే చనిపోయినట్టు పత్రాలు సృష్టించి రైతు భీమ కాజేసిన దానిపై న్యాయం జరిగేట్టు చూడాల‌ని, ధాన్యం కొనుగోలుపై జరిగిన అక్రమాలపై, వరి కొనుగోలు కేంద్రాలను వరి ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రారంభించాలని కలెక్టర్ కార్యాలయానికి కాంగ్రెస్ నేత‌లు వెళ్లారు. మాజీ పార్లమెంట్ సభ్యులు వి.హనుమంత రావు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, TPCC ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్, మాజీ ఎమ్మెల్యే, DCC అధ్య‌క్షులు టి.రామ్మోహన్ రెడ్డి, మాజీ MLC రాములు నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అద్యక్షులు క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి వెళ్లారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డు పై కూర్చొని నిరసన తెలిపారు. తర్వాత మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, కలెక్టర్ ను కలిసి వినతి పత్రాలను అందచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement