Sunday, May 19, 2024

Congress Candidate – నిజామాబాద్ లో అడుగు పెట్టిన షబ్బీర్ అలీ… గజమాలతో సత్కారం,,, బైక్ ర్యాలీ తో హంగామా

నిజామాబాద్ సిటీ , నవంబర్ (ప్రభ న్యూస్)7:నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నాయ కులు షబ్బీర్ అలీ నీ అధిష్టానం ఖరారు చేయడంతో. ఇందూ రులో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చింది.షబ్బీర్ అలీ మొదటి సారిగా నిజామాబాద్ రావడం తో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపింది. మంగళ వారం నిజామాబాద్ అర్బన్ కి మొట్టమొదటిసారిగా షబ్బీర్ అలీ రావడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనం గా స్వాగతం పలికారు. వినా యక్ నగర్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ శివాజీ చౌక్ పెద్ద బజారు మీదుగా నెహ్రూ చౌక్ వరకు చేరుకుంది. పూలాంగ్ చౌరస్తా, గాయత్రీ నగర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ యూత్ నాయకులు క్రేన్ల సహాయంతో.. గజమాలలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. నెహ్రూపార్క్ లో నిర్వహించిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు తాహెర్ బిన్ హందాన్, గడుగు గంగాధర మాజీ ఎమ్మెల్యే ఈ రవత్రి అనిల్ ,నగర అధ్య క్షులు కేశ వేణు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నా కర్,మొహమ్మద్ నయీం అలీ,నజీబ్ అలీ,dr. శివ ప్రసాద్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ,జిల్లా NSUI అధ్యక్షులు వేణు రాజ్, NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపూల్ గౌడ్,రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జావేద్ అక్రమ్, గడుగు రోహిత్,జిల్లా మైనారిటీ అద్యక్షులు ఇర్ఫాన్ అలీ, అబుద్ బిన్ హండం,అబ్దుల్ ఏజజ్,ఈసా,కేశ మహేష్,బొబ్బిలి రామకృష్ణ,విజయ్ పాల్ రెడ్డి,నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement