Saturday, April 27, 2024

అస్తవ్యస్తం.. అధ్వానం.. కొనుగోలు కేంద్రాల తీరుపై కలెక్టర్ ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలు అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉన్నాయని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గూడూరు మండలంలోని గూడూరు, అయోధ్యాపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో రికార్డులను పరిశీలించి ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఐకెపి అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే అంత ఆలస అని మండిపడ్డారు. తక్షణమే కొనుగోలు సంబంధించిన టెండర్లను రద్దు చేయాలని ఆదేశించారు. అనంతరం పొనుగోడు లోని  పాఠశాలను సందర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement