Sunday, April 28, 2024

CMRF – మెరుగైన చికిత్స కోసం రూ. 2.50 లక్షల ఎల్వోసి అందజేసిన మంత్రి వేముల

భీంగల్ బోయిగల్లి కి చెందిన ఎస్. శంకర్ ఆక్సిడెంట్ అయ్యి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో బ్రెయిన్ కు సంబంధించిన మెరుగైన చికిత్స కొరకు 2.50 లక్షల రూపాయల ఎల్వొసి మంజూరు చేయించారు. ఎల్ఓసి కాపీ ని కుటుంబ సభ్యులకు మంత్రి బుధవారం నాడు హైదరాబాద్ లో అందజేశారు.

హాస్పిటల్ వారితో మాట్లాడి బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి మనో ధైర్యం చెప్పారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కొరకు 2లక్షల 50వేల రూపాయల ఎల్ఓసి మంత్రి మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement