Sunday, April 28, 2024

సీఎంఆర్ఎఫ్ పేదలకు ఓ వరం.. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

నిజామాబాద్ రూరల్, ఆగస్టు 17 ప్రభ న్యూస్ : సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు ఓ వరమని టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్దన్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

మహాలక్ష్మి నగర్ కు చెందిన వతులా బాయికి స్మైల్ సర్జరీ అయింది. దీంతో ఆమె ఎమ్మెల్యే ను సంప్రదించింది. గురువారం ఆయన లక్ష రూపాయల చెక్కును బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రేమ్ దాస్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement