Sunday, May 5, 2024

TS: కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు సీఎం వార్నింగ్…

కామారెడ్డి నియోజకవర్గ ప్రతినిధి, ప్రభ న్యూస్ : కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన జిల్లా కేంద్రానికి వచ్చారు. అనంతరం ఎమ్మెల్యే గోవర్ధన్ నివాసంలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.

ఎన్నికల సమయంలో గ్రూపు రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎవరు హద్దు మీరినా సహించేది లేదని హెచ్చరించారు. నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీపరంగా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement