Thursday, May 2, 2024

CM REVANTH: జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో రేవంత్ స‌మావేశం….వంద రోజుల్లో 6 హామీలు అమ‌లుపై సుదీర్ఘ చ‌ర్చ‌లు

హైదరాబాద్‌: ప్రజాపాలనపై కాంగ్రెస్‌ సర్కార్‌ దృష్టి సారించింది. జనం సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ దిశగా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమావేశమయ్యారు.

100 రోజుల్లో 6 హామీల అమలుకు పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా భేటీ జరుగుతోంది.ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు.

భారాస పదేళ్ల పాలనపై చర్చించడంతోపాటు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతున్నారు. ప్రజావాణిని జిల్లా, డివిజన్‌, మండల, గ్రామ స్థాయుల్లో పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ల ద్వారా సమాచారం తీసుకోనున్నారు. ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు.
ప్రజాపాలన’ ప్రధాన ఎజెండాగా ఉన్నప్పటికీ అనుబంధంగా పై నాలుగు కీలక అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం మార్చి 17వ తేదీలోగా మిగిలిన వాటిని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

అర్హతలపైనే ఫోకస్

- Advertisement -

సిక్స్ గ్యారెంటీస్ అమలుకు భారీ స్థాయిలో నిధులు ఖర్చవుతాయని ఆర్థిక నిపుణులతో పాటు అధికారులూ అంచనా వేశారు. వాటి అమలుకు అవసరమైన వనరులను సమీకరించుకోవడంతో పాటు అర్హులైన వారిని గుర్తించడం ఇప్పుడు కీలకంగా మారింది. గ్యారెంటీలకు రూపకల్పన చేసే సమయంలోనే ఏ మేరకు నిధులు అవసరం అవుతాయనే దానిపై కాంగ్రెస్ లోతుగా అధ్యయనం చేసింది. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు మహాలక్ష్మి స్కీమ్ (గ్యారంటీ)లో పేర్కొన్నందున అర్హతలను ఫిక్స్ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏ వర్గానికి చెందిన మహిళలకు అమలు చేయాలన్నది చర్చనీయాంశంగా మారింది.

కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు

కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం వారితో అభిప్రాయాలు తీసుకోనున్నారు. చాలా పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో రేషన్ కార్డులు కీలకంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం కూడా గ్యారెంటీల పేరుతో అందుకునే సాయానికి నిర్దిష్టమైన అర్హతలను ఫిక్స్ చేయడం అనివార్యమవుతున్నది. ఇందులో భాగంగానే రేషన్ కార్డుల కోసం ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, వాటిలో అప్రూవ్ అయినవి, ఇంకా పరిశీలనలో ఉన్నవి, కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించడం.. తదితర అంశాలన్నింటిపైనా కలెక్టర్ల నుంచి సీఎం ఫీడ్‌బ్యాక్ తీసుకుని స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. అనేక పథకాలకు రేషన్ కార్డు కనీస అర్హతగా ఉన్నందున ఈ అంశాన్ని కొలిక్కి తేవడం తప్పనిసరిగా మారింది.

కౌలు రైతుల గుర్తింపుపై ఫోకస్

కౌలు రైతులకు ‘రైతుభరోసా’ పేరుతో ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం చేయనున్నట్లు ప్రకటించినందున వారిని గుర్తించడానికి నిర్దిష్ట క్రైటీరియాను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. లీగల్ చిక్కులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ విధానాన్ని రూపొందించాలని అనుకుంటున్నది. అదే టైంలో రైతు కూలీల (ఉపాధి హామీ జాబ్ కార్డు హోల్డర్లు)ను గుర్తించి వారికి ఏటా రూ.12 వేలు ఇచ్చేందుకు అర్హతలను నిర్ధారించాల్సి ఉన్నది. కొద్దిమంది రైతులు ఒక వైపు పట్టాదారులుగా ఉంటూనే కౌలు రైతులుగానూ ఉంటున్నందున రెండు రకాల మధ్య నిర్దిష్టమైన విభజన రేఖ విషయంపైనే ప్రభుత్వం ఎక్కువ కసరత్తు చేస్తున్నది. దీనిపై క‌లెక్ట‌ర్ల అభిప్రాయాల‌ను, స‌ల‌హాల‌ను తీసుకోవ‌డంతో పాటు ప‌థ‌కం అమ‌లులో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌పై కూడా రేవంత్ రెడ్డి నేడు చ‌ర్చించ‌నున్నారు.. అలాగే జిల్లాల‌లో ప‌టిష్ట‌వంత‌మైన పాల‌న‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను నా జిల్లా అధికారుల‌ను అడిగి తెలుసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement