Monday, April 29, 2024

ముంబైకి బయల్దేరిన సీఎం కేసీఆర్.. కాసేపట్లో ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబై పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల హక్కుల్లో మితి‌మీ‌రు‌తున్న కేంద్రం జోక్యం, కేంద్రంపై పోరాటంలో భావ‌సా‌రూప్యం ఉన్న పక్షాల ఐక్యతపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్‌పవార్‌తోనూ చర్చలు జరుపనున్నారు. సీఎం కేసీఆర్‌ వెంట ఎంపీలు సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement