Monday, April 29, 2024

CM KCR : ఇవాళ నాలుగు చోట్ల సీఎం కేసీఆర్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లు

సీఎం కేసీఆర్ ఇవాళ నాలుగు చోట్ల ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం తాండూరుకు చేరుకోనున్న సీఎం కేసీఆర్‌ మొదటగా తాండూరు పట్టణంలోని విలేమూన్‌ గ్రౌండ్‌లో జరిగే సభకు హాజరవుతారు.

అక్కడి నుంచి మధ్యాహ్నం కోస్గి పట్టణంలో జరిగే సభకు హాజరై అనంతరం మహబూబ్‌నగర్‌లో జరిగే సభకు వెళ్తారు. అక్కడి నుంచి పరిగి పట్టణంలోని జింఖానా గ్రౌండ్‌లో నిర్వహించే సభకు హాజరుకానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement