Tuesday, April 30, 2024

TS : విద్యార్థుల‌మ‌ధ్య ఘర్షణ…ఒక‌రు హ‌తం…

బోధన్, మార్చి 4(ప్రభ న్యూస్): హాస్ట‌ల్ వార్డెన్ లేక‌పోవ‌డంతో విద్యార్థులు రెచ్చిపోయారు. కంట్రోల్ త‌ప్పి వాగ్వివాదానికి పాల్ప‌డ్డారు. అది కాస్తా హ‌త్య‌కు దారితీసింది. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా బోధ‌న్ బీసీహాస్ట‌ల్‌లో చోటుచేసుకుంది.

అస‌లు ఏం జ‌రిగిందంటే…. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం తండాకు చెందిన వెంకట్ హరియాల్ బోధన్ పట్టణంలోని బీసీ కళాశాల బాయ్స్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. డిగ్రీ చదువుతున్న వెంకట్ హర్యాల్ రాత్రి ఇంటర్మీడియట్ చదువుతున్న సహచర విద్యార్థులతో గొడవపడ్డాడు. చిన్ని పాటి గొడవ కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. అంతే.. వెంకటిని ఐదుగురు విద్యార్థులు కలిసి హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement