Saturday, May 4, 2024

Christamas – బాల‌ల అనాథ శ‌ర‌ణాల‌యంలో పవ‌న్ కల్యాణ్ స‌తీమ‌ణి అనా క్రిస్మ‌స్ వేడుక‌లు ..

హైదరాబాద్ – జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అర్ధాంగి అనా కొణిదెల అనాథ బాలల నడుమ క్రిస్మస్ వేడుక‌లు జరుపుకున్నారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్ అనాథ శరణాలయానికి వెళ్లారు. అక్కడి చిన్నారులతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు. అనాథ బాలలతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి తెలుసుకున్నారు. అనాథాశ్రమం నిర్వాహకులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ అర్ధాంగిని జీవోదయ చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులు సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement