Monday, April 29, 2024

Surprise Gift – ఇది ఎనిమిదో వింతే…లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్.

అమరావతి – తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పైగా ఇది ఎవరూ ఊహించని విషయం కూడా. , వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు క్రిస్మస్ కానుకలు పంపారు. “వైఎస్సార్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది… ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి… మీకు 2024లో అంతా శుభం కలగాలి” అంటూ షర్మిల సందేశం పంపారు.

షర్మిల కానుకలు పంపిన విషయాన్ని నారా లోకేశ్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, ఆమె పంపిన కానుకల పట్ల హర్షాన్ని వెలిబుచ్చారు. “ప్రియమైన షర్మిల గారూ… మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీకు, మీ కుటుంబానికి ఈ క్రిస్మస్ తో పాటు, నూతన సంవత్సరాది కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం శుభాకాంక్షలు తెలుపుతోంది” అంటూ లోకేశ్ బదులిచ్చారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు ..

ప్ర‌భువైన ఏసు క్రీస్తు ఆచ‌రించిన‌ ప్రేమ‌, క‌రుణ‌,స‌హ‌నం ప్ర‌తీ ఒక్క‌రిలో పెంపొందాలి. క‌రుణామ‌యుడైన క్రీస్తు మ‌న‌కు అందించిన శాంతి సందేశం స‌మాజానికి పంచి ప్ర‌పంచ‌శాంతికి దోహ‌ద‌ప‌డాలి. క్రీస్తు చూపిన మార్గ‌మైన ద‌య, త్యాగ‌గుణం ప్ర‌తీ ఒక్క‌రూ అల‌వ‌ర్చుకున్న‌ప్పుడే జీవితం సంతోష‌మ‌యం అవుతుంది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా క్రైస్త‌వులంద‌రికీ శుభాకాంక్ష‌లు. ద‌యామ‌యుడు లోకానికి వ‌చ్చిన ప‌ర్వ‌దిన‌మైన క్రిస్మ‌స్ పండ‌గ‌ని ఆనందోత్సాహాల‌తో జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement