Tuesday, May 14, 2024

మానవత్వాన్ని చాటుకున్న చొప్పదండి ఎమ్మెల్యే

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మానవత్వాన్ని చాటుకున్నారు. చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన టి.శ్రీనివాస్  అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యానికి డబ్బులు లేకపోవడంతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ని ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్యే రవి శంకర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. అండగా తాను మీకు ఉన్నానంటూ బాసటగా నిలిచారు. వాళ్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారికి అందించేందుకు కృషి చేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ద్వారా 3 లక్షల రూపాయల ఎల్వోసీని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్, చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement