Monday, April 29, 2024

గ్రామీణ రోడ్లకు మహర్ధశ: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్ధశ వచ్చిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సుల్తానాబాద్‌ మండలం కందునూరిపల్లి గ్రామంలో MGNRWGS పథకం ద్వారా రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దాసరి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. గ్రామాలలో రోడ్ల నిర్మాణాల కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement