Monday, May 20, 2024

తంగ‌ల్ల‌ప‌ల్లిలో చిరుతపుతి సంచారం – అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కి సూచ‌న‌

చిరుత‌పులి సంచారంతో బెంబేలెత్తుతున్నారు సిరిసిల్లా తంగ‌ల్ల‌ప‌ల్లి మండ‌లం వాసులు. కాగా తంగల్లపల్లి మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తుంది. మండలంలోని గండిలచ్చపేటలో రైతు నర్సయ్యకు చెందిన బర్రెపై దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందున్నారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఇటీవల వేణుగోపాల్‌పూర్‌లో రెండు బర్రెలపై దాడిచేసి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. ప్రజలు రాత్రి సమయంలో ఒంటరిగా తిరుగొద్దని అధికారులు సూచించారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement