ఇల్లందు : కాలు జారి కిందపడి చిన్నారి మృతిచెందిన ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఇల్లందులో చోటుచేసుకుంది. సీఎస్ పీ బస్తి ఓల్డ్ కాలనీ సి 4 క్వార్టర్ లో నివాసముంటున్న కామరాజు (సెక్యూరిటీ) జుమ్మేధర్ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… పెనుగొండ శ్రీ లాస్య, పెనుగొండ కిరణ్, దంపతుల కుమార్తె అనిక (5) ఆదివారం మధ్య రాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో కాల కృత్యాల నిమిత్తం వెళ్లిన చిన్నారి కాలుజారి కింద పడటంతో తలవెనుక భాగంలో దెబ్బ తగలడంతో అమ్మాయి కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన సింగరేణి వైద్యశాలకు తరలించగా… పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి మరణించినట్లు ద్రవీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు.