Monday, April 29, 2024

TS | ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో బుల్లెట్ల కలకలం…

నర్సాపూర్ నవంబర్ 16 (ప్రభ న్యూస్) : నర్సాపూర్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం రేగింది. కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో అస్లాం అనే వ్యక్తి అనుమానాస్పదంగా హల్ చల్ చేశాడు. దీంతో, అతనిపై అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పరిశీలించగా.. అతడి వద్ద రెండు బుల్లెట్లు దొరకడంతో వాటిని స్వాధీన పరుచుకున్నారు. ప్రస్తుతం అస్లాంను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement