Wednesday, May 15, 2024

ఛలో బాట సింగారం – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్

శంషాబాద్ – తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లపై బీజేపీ ప్రోగ్రామ్​ నిర్వహించడానికి పిలుపునిచ్చింది. ఇవ్వాల (గురువారం) ఉదయమే హైదరాబాద్​ ఎయిర్​పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి బాటసింగారం వెళ్లడానికి బయలు దేరారు.

కాగా, అతను ఎయిర్​పోర్టు పరిసరాలు దాటగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎటువంటి అనుమ‌తులు లేవ‌ని పోలీసులు ఆయ‌న‌కు తెలిపారు.. దీంతో కిష‌న్ రెడ్డి రోడ్డుపైనే భైఠాయించారు.. బిజెపి నేత‌లు త‌మ కార్య‌క్ర‌మాన్ని అడ్డుకోవ‌డం ప‌ట్ల పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు.. అనంత‌రం కిష‌న్ రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి బిజెపి కార్యాలయానికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement