Sunday, April 28, 2024

Case Filled – కొడంగ‌ల్ బిఆర్ఎస్ అభ్య‌ర్ధి పట్నం నరేందర్‌ రెడ్డిపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు

కొడంగల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిపై నారాయణపేట జిల్లా కోస్గి పోలీసుస్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమెదైంది. కాంగ్రెస్‌ కార్యకర్త కూర నరేష్‌పై కర్రలతో దాడి చేసిన కేసులో పట్నం నరేందర్‌ రెడ్డితో పాటుగా 8 మందిపై పోలీసులు 307తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా పట్నం నరేందర్‌ రెడ్డి పేరును చేర్చారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావంటూ తనను రాళ్లతో, కర్రలతో కొట్టారని బాధితుడు కూర నరేష్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరికొందరు తనపై ఈనెల 24న దాడి చేశారన్నారు. తన ఫోన్‌, బైకు తాళంచెవి, 3 తులాల బంగారు గొలుసు, రూ.20 వేల నగదు కూడా లాక్కున్నారని అందులో తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement