Saturday, May 11, 2024

Maan ki Baat – ముంబై ఉగ్ర‌దాడికి 15 ఏళ్లు.. హేయ‌మైన దాడిగా పేర్కొన్న మోడీ..

న్యూ ఢిల్లీ – ప్రధాని నరేంద్ర మోడీ తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 107వ ఎడిషన్‌లో ప్రసంగిస్తూ 26/11 ముంబై ఉగ్రదాడుల బాధితులను గుర్తు చేసుకున్నారు. భారతదేశం అత్యంత హేయమైన ఉగ్రదాడిని ఎదుర్కొన్న ఈ రోజును దేశం ఎన్నటికీ మరచిపోదన్నారు. నవంబర్ 26వ తేదీని మనం ఎప్పటికీ మరచిపోలేమని, ఈ రోజునే దేశం అత్యంత భయంకరమైన ఉగ్రదాడికి గురైందని ఆయన చెప్పారు.

అలాగే నేడు రాజ్యాంగ దినోత్సవం అంటూ నవంబర్ 26వ తేదీ ప్రత్యేకమైనదని అన్నారు. ఈ రోజు, నవంబర్ 26 అనేది చాలా ముఖ్యమైనదని, 1949లో ఇదే రోజున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని మోడీ అన్నారు. ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’, ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచారాలను ప్రధాని ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులను ఉపయోగించాలనే ఈ కోరిక పండుగలకే పరిమితం కాకూడదని, పెళ్లిళ్ల సీజన్ రానున్నందున వెడ్డింగ్ షాపింగ్‌లో కూడా స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్ర‌జ‌ల‌ను కోరారు.

డిస్టినేష‌న్ పెళ్లిళ్ల‌పై మోడీ సెటైర్
చాలా మంది పెళ్లి చేసుకోవడానికి విదేశాలకు వెళుతున్నారని, భారతదేశంలో పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారని ప్రధాని మోడీ అన్నారు. కొంతమందికి ఇలా చేసుకోవాలని ఉంటుందని తనకు తెలుసని, అయితే ఈ స్థాయిలో కూడా ‘లోకల్ కోసం వోకల్’ని సీరియస్‌గా తీసుకుందామని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఉండనున్నాయి.. త్వరలోనే భారతదేశం ఆ స్థాయికి ఎదుగుతుందని మోడీ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement