Wednesday, May 8, 2024

Exclusive | అక్క‌న్న‌పల్లి వాగులో కారు గల్లంతు.. వీడని ఉత్కంఠ?

ఉమ్మడి మెదక్ బ్యూరో (ప్ర‌భ న్యూస్‌): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతికి సిద్దిపేట జిల్లాలో కారు వాగులో గల్లంతయినట్లు ఘటనలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సిద్దిపేట జిల్లా అక్కనపల్లి వాగులో శుక్రవారం రాత్రి కారు గల్లంతయినట్లు స్థానికుల సమాచారంతో శనివారం ఉదయం నుండి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి పర్యవేక్షణలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

అక్కనపల్లి వాగు కాజ్ వే నుండి పోరెడ్డిపల్లి వంతెన వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు, గజ ఈతగాళ్లు వాగును జల్లెడ పడుతున్నారు. వాగులో వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో గాలిపు చర్యలకు ఆటంకం కలుగుతుంది. కాగా అక్కనపల్లి వాగులో కారు గల్లంతయిన ఘటనలో ప్రయాణికులు క్షేమంగా బయటపడాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement