Wednesday, May 1, 2024

కంటోన్మెంట్ ని జిహెచ్ఎంసీలో కలిపేద్దామా ?

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డ్ ని జీహెచ్ఎంసీలో కలిపెయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డ్‌ను GHMC లో విలీనం చేయాలని ప్రజల నుంచి విపరీతంగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని, తాను దానికి ఏకీభవిస్తున్నాను అని తెలిపారు. దీనిపై అభిప్రాయాలు తెలపాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనేది సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతానికి చెందిన పౌర పరిపాలనా సంస్థ. ప్రధానంగా సైనిక ప్రాంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement