Tuesday, May 21, 2024

టీ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈరోజు సాయంత్రం 5గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీలో చేరికలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చించనున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు ఢిల్లీలో ఉన్నారు. జానారెడ్డి కూడా ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దంగా లేని జానారెడ్డి.. అవసరమైతే ఫోన్ లో అందుబాటులో ఉంటానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement